Sunday, April 28, 2024

కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్..?

ముధోల్ రాజకీయంలో రోజుకో తీరు రాజకీయ పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణరావు పటేల్ చేరుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే తో ఫోన్ లో సంభాషించినట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి, రామచందర్ రెడ్డితో సైతం టచ్ లో వున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే శ్రావణమాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి పటేల్ రెడీ అయ్యారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ముధోల్ రాజకీయంలో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న నారాయణరావు పటేల్ మళ్ళీ రాజకీయంగా రానున్న తరుణంలో తాలూకాలో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నారాయణరావు పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నుండి పోటీ చేశారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయభేరి మోగించడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని ఈ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement