Thursday, May 2, 2024

TS : సాగునీరు అందించాల‌ని రైతుల ధ‌ర్నా

కడం, మార్చి 5 (ప్రభ న్యూస్): పంట‌ల‌కు సాగునీరు అందించాల‌ని రైతులు రోడ్డెక్కారు. రబి సీజన్‌లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామం వద్ద నిర్మల్- మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వ‌హించారు.

సదర్ మాట్ ఆయకట్టు క్రింది గ్రామాలలో యాసంగి పంటలు సాగు చేశామని గత నాలుగు ఐదు రోజుల నుండి తమ గ్రామాల పంటలకు సదర్ మట్ సాగునీరు రావడంలేదని దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇకనైనా పంటలు కాపాడుకోవడానికి సదర్ మట్ కాలువ ద్వారా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement