Sunday, April 28, 2024

ఈజిఎస్‌ పనుల పరిశీలన..

కాసిపేట : మండలంలో ఉపాది హామి పథకం కింద జరుగుతున్న పనులను ఎంపిడిఓ ఎం ఎ అలీం పరిశీలించారు. లంబాడితండా డి. గ్రామంలో జరుగుతున్న చేపల పెంపకం కోసం చేపట్టిన కుంట నిర్మాణం పురోగతి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేసవి తీవ్రవత పెరుగుతున్నందున పని స్థలంలో తాగు నీరు, ఓఆర్‌ఎస్‌ పానీయాలు అందుబాటులో పెట్టాలని సిబ్బందికి సూచించారు. పనికి వచ్చిన కూలీల హాజరును తనిఖి చేసి. కరోనా నేపద్యంలో కూలీలు కోవిడ్‌ నిబందనలు పాటిస్తూ, ఆరోగ్యంగా, క్షేమంగా పనులు చేసేలా చూడాలని ఈజిఎస్‌ సిబ్బందికి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement