Sunday, April 28, 2024

గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ స్ప్రై..

కాసిపేట : మండలంలో రోజు రోజుకు కరోనా విస్తరిస్తుండడంతో గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది వ్యాధిని అడ్డుకునే చర్యలను తీవ్రం చేశారు. పాజిటివ్‌ కేసులున్న గ్రామాల్లోని వీధులలో, ప్రభుత్వ కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రత పనులను చురుకుగా కొనసాగిస్తున్నారు. కాసిపేట, రేగులగూడెం, రొట్టెపెల్లి, దేవాపూర్‌, ముత్యంపెల్లి, కోనూర్‌, పల్లంగూడ తదితర గ్రామాలలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయడంతో పాటు చేతి పంపుల వద్ద బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, తాగు నీటి బావులు, మంచి నీటి ట్యాంకుల వద్ద క్లోరినేషన్‌ పనులను ఆయా పంచాయతీల సిబ్బంది చేపట్టారు. కరోనా వ్యాప్తిని అడ్డకునే ప్రయత్నాల్లో సిబ్బంది పనులను చురుకుగా కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement