Sunday, April 28, 2024

కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు..

కాసిపేట : మండలంలోని కోమటిచేను గ్రామపంచాయితీ పరిధిలో గల రేగులగూడెంకు చెందిన కరోనా బాధితులకు
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు మధుసుదన్‌ రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. పత్రికల ద్వారా ఆ గ్రామంలోని 56 మందికి కరోనా సోకగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకొని వారిని ఆదుకునేందుకు తనవంతు సహాయంగా గ్రామంలోని 30 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావస సరుకులను అందజేయడంతో పాటు మాస్కులను, శానిటైజర్లను గ్రామస్తులకు అందజేశారు. కరోనా నుండి రక్షణ కోసం ప్రతీఒక్కరు వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధుసుదన్‌ రెడ్డితో పాటు గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement