Sunday, April 28, 2024

భైంసా హాస్పిటల్ సిబ్బందిపై కలెక్టర్ గుస్సా..

భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిట‌ల్ ను గురువారం కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందిపై గుస్సా అయ్యారు. హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సీరియస్ అయ్యారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలను ఆరా తీశారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని, రోగులకు మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణ పై గరం అయిన కలెక్టర్ అక్కడ మందులు కూడా సరిగా లేవని ఒక రోగి చెప్పడంతో ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ డా.కాశినథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement