Tuesday, May 7, 2024

తాంత్రిక పూజల కలకలం.. యువకుడి దుర్మరణం

చెన్నూర్ టౌన్, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తాంత్రిక పూజల కలకలం రేగింది. స్థానిక గోదావరి నది సమీపంలో ఓ యువకుడి ఆరోగ్యం బాగుపడేందుకు కుటుంబ సభ్యులు తాంత్రిక పూజలు చేయిస్తున్న క్రమంలో దాసరి మధు(33) అనే యువకుడు మృతి.

ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది, ఆ నోట ఈ నోట సోమవారం పోలీసుల వరకు వెళ్లడంతో యువకుడి దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో అడ్డుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement