Saturday, April 27, 2024

ADB: డీసీఎంఎస్ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలి… రైతుల ధర్నా

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెర్కపల్లె గ్రామంలోని డీసీఎంఎస్ కొనుగోలుదారునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ మండలంలోని పెర్కపల్లి గ్రామ రైతులు దస్తూరాబాద్ కలమడుగు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… పెరకపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం డీసీఎంఎస్ కొనుగోలుదారునికి వరి ధాన్యం అమ్ముతున్నామని, డీసీఎంఎస్ కొనుగోలుదారుడు ధాన్యం తూకంలో మోసం చేస్తున్నారన్నారు.

ఈ సంవత్సరం సహకార సంఘం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారని సహకార సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయకుండా డీసీఎంఎస్ కొనుగోలుదారుడు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి దస్తురాబాద్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి, పోలీసులు చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement