Saturday, May 4, 2024

TS: కారు ఢీకొని… చుక్కల జింక మృతి

జన్నారం, ఫిబ్రవరి 13 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని పైడిపల్లి గ్రామ సమీపాన మంగళవారం ప్రధాన రహదారిపై కారు ఢీకొన్న ప్రమాదంలో కృష్ణ చుక్కల జింక చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక రేంజ్ ఆఫీసర్ హఫీజోద్దీన్ తెలిపారు. ఆ జింకను ఢీకొన్న ఎపి 15 ఎపి 3003 నెంబర్ గల కారును స్వాధీనం చేసుకుని, సొంత పూచికత్తుపై వదిలేశామన్నారు.

జైపూర్ కు చెందిన ఓ పత్రిక విలేఖరి తన కుటుంబ సభ్యులతో అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఆ జింక మృతదేహాన్ని ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు శ్రావంతి, వెంకటేష్, రైమోద్దీన్లు స్వాధీనం చేసుకొని స్థానిక అడవిలో గోతితవ్వి పాతిపెట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement