Monday, April 29, 2024

కార్మికుల వినతి పత్రం

బెల్లంపల్లి : మున్సిపల్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఇన్సూరెన్స్‌ బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ కరోనా విజృంభించిన సమయంలో కూడా మున్సిపల్‌ కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించామని అన్నారు. విధి నిర్వాహణలో ఉండి ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నామని, అయినప్పటికీ తమకు ఈఎస్‌ఐ సౌకర్యం గానీ, హెల్త్‌ కార్డులు గానీ లేవని, మానవత్వంతో అర్థం చేసుకోని ఇన్సూరెన్స్‌ బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎస్‌.కె.యాకుబ్‌, మంచిర్యాల జిల్లా కార్యదర్శి గొడిసెల చంద్ర మొగిలి, పట్టణ కార్యదర్శి పి.సుమన్‌, పట్టణ అధ్యక్షుడు కె.కమల్‌, నాయకులు వీర్ల రాజమౌళి, ఎస్‌.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement