Friday, March 29, 2024

నర్సరీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలం కన్నాల, సోమగూడెం గ్రామపంచాయితీలోని పలు నర్సరీలు, శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు పనులను జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్లికేరి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేది లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేనట్లయితే సంబంధిత సర్పంచు, అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఏపీఓ జీనత్‌, సర్పంచ్‌ ప్రమీళగౌడ్‌, కన్నాల సర్పంచ్‌ జిల్లపెల్లి స్వరూప, వెంకటస్వామి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement