Thursday, May 2, 2024

ఎస్ ఐకి సన్మానం..

కాసిపేట : కాసిపేట మండలంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలు సేవాభావంతో రోగులకు ప్రథమ చికిత్స సేవలను అందించాలని దేవాపూర్‌ ఎస్ ఐ విజేందర్‌ పేర్కొన్నారు. కొండాపూర్‌ (యాప) గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ ఐ పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఏ చిన్న ఇబ్బంది కల్గినా, జబ్బు చేసినా ముందుగా సంప్రదించేది అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలేనని పేర్కొన్నారు. నిరుపేదలకు సేవాభావంతో ప్రథమ చికిత్స సేవలు అందించి ఆదుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజలు ఆర్‌ఎంపీలపైనే ఆధారపడుతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలువురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎస్ ఐ విజేందర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని జిల్లా నాయకులు తీగల శ్రీనివాస్‌, మండల నాయకులు సత్యనారాయణ, రమేష్‌, పలువురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement