Monday, April 29, 2024

షర్మిల విజయమ్మ కోర్ట్ కి రావాల్సిందే

పరకాల ఎన్నికల సమయంలో వైఎస్.విజయలక్ష్మి, షర్మిలపై పెట్టిన కేసులపై బుధవారం విచారణ జరిగింది. పరకాల ఎన్నికల సందర్భంగా గతంలో పెట్టిన రెండు సెక్షన్లను హైకోర్టు కొట్టివేసిందని వైఎస్వి జయలక్ష్మి, షర్మిలా తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కాగా ఐపీసీ 341 సెక్షన్ మాత్రమే కొనసాగించవచ్చని హైకోర్టు తీర్పును గుర్తుచేశారు.అయితే కేసులో ఆధారాలు లేని కారణంగా పిటిషనర్ల హాజరు మినహాయింపు కోరుతూ వైఎస్.విజయలక్ష్మి, షర్మిలా తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ మార్చి 25కి వాయిదా వేసింది. వైఎస్ విజయలక్ష్మి, షర్మిలతోపాటు నిందితులందరూ హాజరుకావాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement