Sunday, April 28, 2024

Adilabad – ఆర్టీసీ బ‌స్సు బోల్తా – నలుగురికి గాయాలు..

ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండ‌ల ప‌రిధిలో రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. చ‌ర్ల‌ప‌ల్లి గ్రామ స‌మీపంలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డింది. వివరాల్లోకి వెళితే అదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టిసి బస్సు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ నుండి ఝరి పూనగూడ కు ప్రయాణికులతో వెళ్తూ చర్లపల్లి ఝరి గ్రామాల మధ్య అదుపు తప్పి బోల్తా పడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని అదిలాబాద్ రిమ్స్ కు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. డ్రైవర్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పేందూర్ శంకర్ కటకం గంగమ్మలకు డ్రైవర్ అజయ్ కు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement