Thursday, May 2, 2024

బుద్ధ విహార్ ను దర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్

తాంసి జూన్ 21(ప్రభాన్యూస్) : అదిలాబాద్ జిల్లా తంసి మండల కేంద్రం సమీపంలోని బుద్ధ విహార్ ను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం పురస్కరించుకుని బుద్ధ విహార సందర్శించిన కలెక్టర్ ప్రత్యేక పూజలు చేసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ధ్యాన్నం చేసారు.


ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్, జెడ్పిటిసి లు గోక గణేష్ రెడ్డి, తాటిపల్లి రాజు, ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో ఆకుల భూమయ్య, వార్డెన్ లు నారాయణ రెడ్డి, నర్సింగ్, బౌద్ధ బిక్షులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement