Thursday, May 2, 2024

Railway: నేటి నుంచి రైళ్లకు అదనపు హాల్టులు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లే పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నిర్ణయం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఇక నుంచి దక్షిణ ఎక్స్ ప్రెస్ జమ్మికుంట స్టేషన్‌లో హజ్రత్ నిజాముద్దీన్ గరీభ్రథ్ ఎక్స్ ప్రెస్ వరంగల్, పెద్దపల్లిస్టేషన్లలో సికింద్రాబాద్-రాయ్పూర్, సికింద్రాబాద్-రాయ్ పూర్ హిస్సార్, హైదరాబాద్-రాక్సల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్-బీదర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌, మర్పల్లి స్టేషన్‌లో ఆగనున్నాయి. నారాయణాద్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లు మిర్యాలగూడలో నర్సాపూర్, విశాఖ, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ నల్గొండలో ఆగుతాయి. నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ మిర్యాలగూడలో నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్ ప్రెస్ నల్గొండలో హైదరాబాద్- వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ గద్వాలలో అంబేడ్కరనగర్-యశ్వంత్ పూర్, నాగర్సోల్ -చెన్సై సెంట్రల్, గోరఖ్ పూర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ మహబూబ్ నగర్ లో యశ్వంత్ పూర్ -కాచిగూడ ఎక్స ప్రెస్ షాద్ నగర్ , జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయి. ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ద.మ. రైల్వే స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement