Tuesday, July 23, 2024

Ayodhya: నేడు ప్రధాన ఆలయంలోకి రాములోరి విగ్రహం

నేడు ప్రధాన ఆలయంలోకి అయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరానికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయోధ్యలోకి అనుమతించరు.

కాగా అంతకుముందు జనవరి 18న‌ వివేక్ సృష్టి ట్రస్ట్ నుండి రాంలాలా విగ్రహాన్ని ట్రక్కులో రామాలయానికి తీసుకువచ్చారు. విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లేందుకు క్రేన్ సాయం తీసుకున్నారు. జనవరి 16 ప్రారంభమైన రామాలయంలో సంప్రోక్షణకు ముందు పవిత్రమైన ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి. వేడుక ప్రధాన కార్యక్రమం జనవరి 22 న జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement