Monday, April 29, 2024

ADB : బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది

బీఆర్ఎస్ అధికారంలో వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వం ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ గురువారం మండలంలోని ఆల్లంపల్లి, గోండుగూడ అల్లంపల్లి తండా,గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు డప్పు చప్పుల్లా మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారెంటీలను,మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నేరవేర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. రైతు బంధు పథకం పేద రైతులకు శాపంగా మారిందన్నారు.రైతుబంధు పథకం వల్ల భూస్వాములు లాభపడుతున్నాడని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజల భూములను ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు.కాంగ్రెస్ అధికారంలో వస్తే ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోను పక్కగా ఆమలు చేస్తామన్నారు. బిజెపి బీఆర్ఎస్లు ఒకటేనని ఆపార్టీలను ఎవరు నమ్మకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement