Thursday, May 9, 2024

ADB : లింగాపూర్ లో బిజెపి పార్టీకి 50 మంది కార్యకర్తలు రాజీనామా

క‌డెం, నవంబర్ 2 (ప్రభ న్యూస్) కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేవైఎం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు కమ్మల స్వామి, 50 మంది పార్టీ కార్యకర్తలతో బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాల నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన చెందారు.

పార్టీలో కష్టపడే వారికి న్యాయం జరుగుతలేదు అని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఒకటి రెండు రోజుల్లో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజీనామా చేసినవారిలో బొంగు చిన్న వెంకన్న, పంజాల రాజు, రమేష్,కడారి విజయ్,కమ్మల శివ, నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement