Thursday, May 2, 2024

కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత… పోలీసుల లాఠీ చార్జ్

మంత్రి కేటీఆర్ నారాయణ పేట జిల్లాలో పర్యటనలో ఉద్రిక్త నెలకొంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ  ఆసుపత్రిని ప్రారంభించి మరో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ పై ఒక్కసారిగా ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో మంత్రి పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురు ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement