Sunday, May 5, 2024

Breaking: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం

ములుగు జిల్లాకేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రేమనగర్‌ గట్టమ్మ టెంపుల్‌ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. తీవ్ర గాయాలకు గురవడంతో ద్విచక్ర వాహనంపైనే ప్రాణాలను వ‌దిలిన‌ట్టు తెలుస్తోంది. మృతుడిని వెంకటాపూర్‌ మండలం కేశవపూర్‌ గ్రామానికి చెందిన‌ పల్లెవేణి రాజు (22)గా గుర్తించారు. ఇత‌ను జాకారం ద‌గ్గ‌రున్న‌ పత్తి మిల్లులో పని చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement