Saturday, May 4, 2024

Big Breaking | ప్రియురాలు మోసం చేసిందని.. రైలుప‌ట్టాల‌పై యువకుడి ఆత్మహత్య

శంకరపల్లి (ప్రభ న్యూస్): ప్రియురాలు మోసం చేసిందని కలత చెంది ఓ యువ‌కుడు దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న‌ తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో ద్వారా సమాచారం చేర వేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్‌ప‌ల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఇవ్వాల (బుధ‌వారం) జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన కురువ మహేష్(21) హైదరాబాద్ లోని నల్ల మల్లారెడ్డి కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. త‌న ప్రేమ విఫలం అయ్యింద‌నే కారణంతో ఆ యువకుడు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి, రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌పై చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రియురాలు మోసం చేస్తే జీవితం అంతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని, ఆమె కాకుంటో మ‌రో యువ‌తి దొర‌క్క‌పోతుందా.. ప్రాణం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌ల్లిదండ్రుల‌ను ఆగం చేసి, మంచి చ‌దువు చ‌దువిన వారు ఇలా చేయ‌డం ఏంట‌ని సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. యువ‌తీ, యువ‌కులు ప్రేమ పేరుతో త‌ప్పుదారి ప‌ట్టొద్ద‌ని, క‌న్న‌వారిని మంచిగా చూసుకోవాల‌ని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement