Tuesday, April 30, 2024

TS: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 20 (ప్రభ న్యూస్) : భర్తను భార్య గొడ్డలితో నరికిచంపిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఖానాపూర్ ఎస్ఐ లింబాద్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


పిట్టల నడిపి రాజన్న ప్రతిరోజూ మద్యం తాగుతూ తన భార్యతో గొడవపడే వాడు. రోజూ లాగే మంగళవారం సాయంత్రం తన భార్య పిట్టల లక్ష్మితో గొడవకు దిగగా ఎంత వేడుకున్నా వినకపోవడంతో భార్య ఆవేశంలో గొడ్డలితో నడిపి రాజన్న తలపై నరకగా తీవ్రమైన రక్త గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖానాపూర్ సిఐ డి మోహన్, ఖానాపూర్ ఎస్ఐ. జి. లింబాద్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement