Tuesday, April 30, 2024

Breaking: భార్య‌ను చంపి, తానూ ఆత్మహ‌త్య చేసుకున్న భ‌ర్త‌.. భూపాల‌ప‌ల్లి జిల్లాలో క‌ల‌క‌లం

మహాదేవపూర్, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భార్య‌భ‌ర్త‌ల మృతి క‌ల‌క‌లం రేపింది. భార్య‌ను చంపేసి ఆ త‌ర్వాత తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు ఓ భ‌ర్త‌. మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఈ ఘ‌ట‌న ఇవ్వాల (ఆదివారం) రాత్రి వెలుగులోకి వ‌చ్చింది. గ్రామానికి చెందిన కండెల బుచ్చమ్మ (55), కండెల జగన్ (60) భార్యభర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు త‌లెత్తాయి. దీంతో నిన్న (శనివారం) రాత్రి క్షణికవేశానికి లోనైన భర్త, భార్య బుచ్చమ్మను గొంతు నులిమి చంపిన‌ట్టు తెలుస్తోంది. ఆపై తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మహాదేవపూర్ ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘంటనా స్థలాన్ని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement