Sunday, April 28, 2024

KNR : లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు వేగంగా రావడం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement