Saturday, May 4, 2024

వ్యక్తి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

పఠాన్ చెరు, ప్రభ న్యూస్ : పటాన్ చెరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని లక్డరం గేటు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు బైంసా పట్టణానికి చెందిన ఎండి నదీమ్ (27) గా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా లక్డారం గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గొడవకు దిగి నదీమ్ ను హతమార్చినట్లు తెలుస్తోంది.

ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న నదీమ్ ను చూసిన స్థానికులు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హ‌త్య జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలించి, ఆధారాలు సేక‌రించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నదీమ్ ను హ‌త్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాత క‌క్ష‌ల కార‌ణంగానే మ‌ర్డ‌ర్ చేసి ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని పటాన్ చెరు ఏరియా హాస్పిట‌ల్ మార్చురీకి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement