Friday, April 26, 2024

Big Breaking | ఆగి ఉన్న ట్రాక్టర్​ను గుద్దుకున్న బైక్​.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. నర్సంపేట మండలం ముత్తోజిపేట టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైక్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, మృతుడిని మేడపల్లి గ్రామానికి చెందిన తోట కుమారస్వామిగా గుర్తించారు. ఇక.. బైక్​ మీద ఉన్న అతని భార్య రమనీల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement