Tuesday, May 14, 2024

Breaking | ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్​.. ప్రమాదంలో ఒకరు మృతి

నిర్మల్ జిల్లాలో ఇవ్వాల (సోమవారం) రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ముధోల్ మండలం తరోడ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు నడుపుతున్న వ్యక్తి చనిపోయాడు. కుబీర్ మండలంలోని డోడర్న తండాకు చెందిన అనిల్ జాదవ్ (35) నిజామాబాద్ నుండి బైంసా వెళ్లే క్రమంలో తరోడ వద్ద ఆగి ఉన్న లారీనీ వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో అతని బైకుతో సహా లారీ క్రాష్​ బ్యారియర్స్​లో ఇరుక్కపోయి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement