Tuesday, April 30, 2024

TS: వరంగల్ జిల్లాలో 13ఏళ్ల బాలుడు ఆత్మహత్య..

వరంగల్ కాశీబుగ్గలో విషాదం నెలకొంది. స్థానిక రాములవారి వీధిలో నివాసముంటున్న మడిపల్లి లక్ష్మి-నాగరాజు దంపతుల కుమారుడు సాత్విక్ (13) గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే సాత్విక్ ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

కాగా, మడిపల్లి లక్ష్మి-నాగరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇందులో సాత్విక్ అందరికంటే చిన్నవాడు. సాత్విక్ కాశీబుగ్గ గుడి సమీపంలోని నరేంద్ర నగర్ హైస్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడని, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కాశీబుగ్గ, ఓసిటీ ప్రాంతాల్లో పలు దుకాణాల్లో పూలు అమ్ముతూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే సాత్విక్ చాలా చురుకుగా ఉండేవాడని, కాలనీవాసుల నోట్లో నాలుకగా ఉండే సాత్విక్ చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement