Wednesday, May 1, 2024

RR: వికారాబాద్ లో 77కిలోల గంజాయి పట్టివేత..

వికారాబాద్ టౌన్, జనవరి 12(ప్రభ న్యూస్) : వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రైన్ లో మహారాష్ట్రకి గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 77కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు.. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement