Tuesday, April 30, 2024

రాజేంద్రనగర్ లో కారు బీభత్సం..నలుగురికి తీవ్ర గాయాలు

రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సన్ సిటీ నుండి మెహదీపట్నం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు… కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తించారు. తమ స్నేహితుడు జైద్ ఖాన్ ను సన్ సిటీ వద్ద వదలి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement