Sunday, May 5, 2024

అడవిలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ములుగు, బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement