Thursday, May 2, 2024

24 Hours Hunger Strike – నిరుద్యోగ యువతను మోసం చేసిన కెసిఆర్ స‌ర్కార్ – కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – నిరుద్యోగ యువ‌త‌ను కెసిఆర్ ప్ర‌భుత్వ మోసం చేసింద‌ని బిజెపి తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు,కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆరోపించారు.కేసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 24 గంట‌ల ఉపవాస దీక్ష చేపట్టారు.. ఈ దీక్ష రేపు ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న నిరుద్యోగ యువతకు సంఘిబావంగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉంది యువత అన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ అడిగితే కాల్చిపారేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు. తెలంగాణ కోసం విద్యార్థులు కాలికి గజ్జ కట్టి అడారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వక‌పోవ‌డంతోనే 12 వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నార‌ని అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో కెసిఆర్ కుటుంబం కి సంబందించిన వ్యక్తి ఒకరు పెట్రోల్ పోసుకున్నారని, . అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయనకు అగ్గిపెట్టె దొరకలేదని వ్యంగాస్త్రం వేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతపై వివక్షతతో ఉందన్నారు. తెలంగాణ వ‌స్తే విశ్వ విద్యాలయాలు కళ కళ‌ లడుతాయని, ఖాళీలు భర్తీ అవుతాయని అనుకున్నారని తెలిపారు. ఉద్యోగాలు వస్తాయని భావించారని తెలిపారు. కానీ నిరుద్యోగ యువతను కెసిఆర్ ప్ర‌భుత్వం పథకం ప్రకారం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ చేతకాని తనం వల్ల పేపర్ లీకేజీ లు అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement