Saturday, May 4, 2024

హైదరాబాద్ శివారులో చిన్నారి మిస్సింగ్

హైద‌రాబాద్ శివార్ల‌లోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో రెండేళ్ల చిన్నారి అదృశ్య‌మ‌య్యాడు. జ‌లాల్‌బాబాన‌గ‌ర్‌కు చెందిన అబ్ధుల్ ర‌హీ, త‌బుస‌మ్ దంపతుల రెండేళ్ల కుమారుడు నిన్న సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో క‌నిపించ‌కుండా పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ప‌రిస‌ర ప్రాంతాల్లో వెతికారు. ఎంత‌కు క‌నిపించ‌కపోవ‌డంతో పోలీసును ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు ఆధారాలు సేక‌రించారు. బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement