Sunday, May 5, 2024

Breaking: చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్లు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. కాలేశ్వరం ప్రాజెక్ట్ నుండి 10 టీఎంసీల నీటిని కేటాయిస్తూ, మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. ఎత్తిపోతల పథకం పూర్తయితే చెన్నూర్ నియోజకవర్గంలోని 98వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యులు బాల్కసుమన్ హర్షం వ్యక్తం చేయడంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెన్నూరు నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement