Friday, May 17, 2024

ఇంకోసారి దత్తపుత్రుడంటే.. సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తది: పవన్

తనను దత్తపుత్రుడని అంటే.. తాను కూడా సీబీఐ దత్తపుత్రుడని అనాల్సి వస్తదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ… తాను సీఎం పదవిని గౌరవిస్తానన్నారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కౌలు రైతుల కష్టాలు వింటుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. చంచల్ గూడ జైల్లో షటిల్ ఆడుకున్న వాళ్లా మాకు చెప్పేదని అన్నారు. జనసైనికులపై చేయి పడితే మర్యాద ఉండదు… జాగ్రత్త అని పవన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement