Sunday, April 28, 2024

మియాపూర్ లో విషాదం.. 13 నెలల చిన్నారి మృతి

హైదరాబాద్ లోని మియాపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అదృశ్యమైన 13 నెలలు చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటి సమీపంలోని నీటి గుంటలో చిన్నారిని విగతజీవిగా కనిపించింది. వివరాల్లోకి వెళ్లితే.. మియాపూర్‌లోని ఓంకార్ నగర్‌లో నివాసముండే దంపతులకు 13 నెలల పాప ఉంది. చెత్త ఏరుకుని జీవించే ఆ దంపతులు ఆదివారం ఉదయం బయటికి వెళ్తూ చిన్నారికి పక్కింట్లో వదిలారు. అయితే, సాయంత్రం వచ్చేసరికి పాప కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బిడ్డకోసం వెతికి వెతికి.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉండే 13ఏళ్ల బాలుడు పాపను ఎత్తికెళ్లి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు చిన్నారి కోసం గాలించగా.. ఇంటిసమీపంలోని నీటితొట్టిలో మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాప కళ్లు పొడిచేసి ఉండటంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement