Friday, March 29, 2024

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని యువకుడు ఆత్మహత్య

ఏపీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని ఓ నిరుద్యోగి మనస్తాపం చెందాడు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన వీరాంజనేయులు అనే నిరుద్యోగి గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. గత కొంతకాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపం చెందిన వీరాంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement