Tuesday, April 30, 2024

TS : స‌కాలంలో ప‌రీక్ష‌ల‌కు చేర‌వేస్తాం…… సజ్జనార్ ట్వీట్…

ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోందని సజ్జనార్ వెల్లడించారు.

- Advertisement -

మార్చి 18 నుంచి ఏప్రిల్ 02 వరకు విద్యార్థుల కోసం ఫ్రీగా బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చనని సజ్జనార్ తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉందన్నారు సజ్జనార్. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని TSRTC యాజమాన్యం విద్యార్థులను కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement