Sunday, April 28, 2024

TS: ఖమ్మం కార్పొరేషన్ కు రూ.100కోట్ల నిధులు.. మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పువ్వాడ

ఖమ్మం : రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్ కు చేసిన విజ్ఞప్తి మేరకు TUFIDC (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖమ్మంకు రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు.

శుక్రవారం ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా జీవో కాపీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి మరో రూ.100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ప్రజల తరపున కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్ కుమార్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement