Friday, April 19, 2024

కేరళలో 12 మందికి జికా వైరస్

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ.. కేరళలో జికా వైరస్ కేసులు బయటపడట ఆందోళన కలిగిస్తోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు 19 మంది శాంపిళ్లను పంపించగా.. వారిలో 12 మందికి జికా వైరస్ సోకినట్లు తేలింది.

కేరళలో జికా వైరస్ మొదటి కేసు 24 ఏళ్ల ఓ గర్భిణీకి వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గురువారం తెలిపారు. ఆమె ఈ నెల 7న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువులో ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని చెప్పారు. తల్లీబిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. తిరువనంతపురం నుండి మరో 13 మంది వైరస్ కేసులు ఉన్నాయని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) రిపోర్ట్  కోసం ప్రభుత్వం వేచి ఉందన్నారు. తిరువనంతపురం నుంచి పంపిన 19 శాంపిల్స్‌లో వైద్యులతో సహా 13 మంది ఆరోగ్య కార్యకర్తలు జికాకు సానుకూలంగా ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

జికా వైరస్ లక్షణాలు

జికా వైరస్ సోకితే జ్వరం, దద్దుర్లు, కండ్ల కలకలు, కీళ్ల నొప్పులు, తల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. జికా వైరస్ మొట్టమొదటిసారిగా 1947లో ఉగాండాలోని ఓ అడవిలో బయటపడింది. ఈ జికా వైరస్ ఏడెస్ దోమ వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతోంది. ఏడెస్ దోమలు నిల్వ ఉన్న నీటిలో సంతానోత్పత్తిని చేస్తాయి. జికా వైరస్ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ బారినపడిన వారిలో కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలను కనిపించకపోవచ్చు. జికా వైరస్ గర్భవతులకు చాలా ప్రమాదం. కడుపులో పెరుగుతున్న బిడ్డపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ నియంత్రణకు ఎటువంటి టీకాలు కాని, మందులు కాని ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.

ఇది కూడా చదవండి: ఈ ఏడాది థర్డ్ వేవ్ ఉండదు: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement