Saturday, May 4, 2024

మోడీకి ప‌ట్టిన గ‌తే కేసీఆర్ కి పడుతుంద‌న్న ‘వైఎస్ ష‌ర్మిల‌’

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి రైతులు చుక్క‌లు చూపించార‌ని, సీఎం కేసీఆర్ కి కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వాలు రైతుల సంక్షేమాన్ని మ‌ర‌చింద‌న్నారు. ఈ మేర‌కు రైతుల ప్రాణాల‌తో ఆడుకుంటుంటే కడుపుమండిన రైతన్నలు ప్రధానమంత్రి మోడీకి సైతం చుక్కలు చూపించారని ఎద్దేవా చేశారు. వెనక్కి పంపించారు. తిరగబడ్డ ఈ రైతులే రేపు సీఎం కేసీఆర్ అధికారానికి కర్రుకాల్చి వాత పెడతార‌ని షర్మిల హెచ్చ‌రించారు. వరి కొనకుండా రైతుకు చితి పేర్చుతుంటే ,వీధిన పడ్డ రైతుకు అండగా మేం రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతుంటే, ఆపడానికి మీరు కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోవచ్చు.. కానీ, మీ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. ఈ చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని షర్మిల తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement