Monday, April 29, 2024

Love Triangle | మర్డర్​కి దారితీసిన ట్రయాంగిల్​ లవ్​.. బండరాయితో కొట్టి చంపేశాడు!

ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ కాస్త మర్డర్​కి దారితీసింది. ఇద్దరు ఫ్రెండ్స్​ అనుకోకుండా ఒకే మహిళను ప్రేమించారు. ఒకే దగ్గర జాబ్​ చేస్తున్న వారి మధ్య సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే.. ఒకరికి తెలియకుండా మరొకరు ఆ మహిళను లవ్​చేశారు. కాగా, ఈ విషయం బయటపడడంతో తట్టుకోలేక.. తన ఫ్రెండ్​ని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తన లవర్​.. మరో దోస్త్​తో కలిసి మరీ ​క్లోజ్​గా తిరగడాన్ని తట్టుకోలేకపోయాడు. దీన్ని చూసి అసూయతో ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల ఉద్యోగి తన ఫ్రెండ్​ని పెద్ద బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారి నిర్ధారించారు. నిందితుడు చుట్టాన్ సాఫీ కాగా, బాధితుడు సందేశ్ పాటిల్ గా గుర్తించారు. మృతదేహాన్ని సబర్బన్ జోగేశ్వరిలోని రైలు పట్టాల దగ్గర పడేశాడని. మంగళవారం అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇక.. నిందితులు, బాధితురాలైన మహిళ ఒకే బ్యాంకులోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. బీహార్‌కు చెందిన సాఫీ, ప్రస్తుతం గోరేగావ్‌లో ఉంటున్నాడు. మే 15వ తేదీ రాత్రి సందీప్​ పాటిల్‌ను మద్యం సేవించడానికి జోగేశ్వరి రైల్వే స్టేషన్​ సమీపానికి పిలిచాడు. ఆ తర్వాత ఈ నేరానికి పాల్పడ్డాడు. సాఫీ, పాటిల్‌పై రాయితో దాడి చేశాడు. ఆ తర్వాత అతను స్పృహతప్పి పడిపోయాడు. అంతటితో ఆగకుండా అతని తలను బండరాయితో కసితీరా తుక్కు తుక్కుగా పగలగొట్టేశాడు. అక్కడి నుంచి పారిపోయే ముందు డెడ్​బాడీని రైల్వే ట్రాక్‌ దగ్గర పడేశాడు అని గవర్నమెంట్​ రైల్వే పోలీసు (జీఆర్​పీ) అధికారి తెలిపారు.

- Advertisement -

కాగా, కొందరు బాటసారులు మృతదేహాన్ని గమనించి జోగేశ్వరి రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు GRP ప్రాథమికంగా గుర్తించింది. వెంటనే నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement