Monday, April 29, 2024

యూపీ కోర్టులో కాల్పులు.. ఇద్దరికి గాయాలు

జువాన్‌పూర్‌, ఉత్తరప్రదేశ్‌ : జువాన్‌పూర్‌ కోర్టులో మంగళవారం పట్టపగలు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో రెజ్లర్ బాదల్‌ యాదవ్‌ హత్య కేసులో నిందితులైన ఇద్దరు విచారణ ఖైదీలు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విచారణ ఖైదీలు సూర్య ప్రకాష్‌, మిథిలేష్‌ గిరీలను తొలుత స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను వారణాసికి తరలించినట్టు పోలీసుల తెలిపారు.

షూటర్లు కాల్పులు జరిపిన వెంటనే కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లు వారిని అదుపులోకి తీసుకొని చితక్కొట్టారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. షూటర్లలో ఒకరిని మరణించిన రెజ్లర్‌ బాదల్‌ యాదవ్‌ సోదరుడు శ్రవణ్‌గా గుర్తించినట్టు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. కోర్టు ఆవరణలో అదనపు బలగాలను మోహరింపజేసినట్టు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement