Thursday, May 2, 2024

వికటించిన నాటు వైద్యం.. మంచానికి పరిమితమైన యువకుడు

నాటు వైద్యం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. మెడ నొప్పితో బాధపడుతున్న యువకుడికి నాటు వైద్యుడు రాజ్ కుమార్ వింత వైద్యం చేశాడు. ఏంబీఏ చదివిన రాజ్ కుమార్.. కరీంనగర్ లోని అలుగునూర్ చౌరస్తాలో ఎలా బోతారం వైద్య సేవ పేరిట నాటు వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితుడు సాయి మెడలు పట్టుకోవడంతో వారం క్రితం నాటు వైద్యుడి వద్దకు వెళ్లాడు. సున్నితమైన ప్రదేశంలో నరాలపై బలంగా రుద్ది, టవల్ మెడకు కట్టి లాగడంతో సాయి అనారోగ్యం పాలైయ్యాడు. మెడలు తిప్పలేని పరిస్థితిలో మంచానికి పరిమితమైపోయాడు. మెడ భాగంలో వాపు రావడంతో నొప్పి భరించలేక పోతున్నాడు. అయితే సాయికి నాటు వైద్యం చేసిన రాజ్ కుమార్ సమర్ధించుకుంటున్నాడు. నాటు వైద్యానికి గుర్తింపు లేకపోయినా వైద్య సేవ పేరిట సెంటర్లు ఏర్పాటు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement