Saturday, May 18, 2024

FLASH: పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్య

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. పాపయ్యపేట గ్రామానికి చెందిన గాలి విజయ-వెంకన్న దంపతుల కుమారుడు సందీప్(22) హన్మకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. మంథిని ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిన సందీప్.. గత నెలలో అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. ఈనెల 22 వ తేదీన జైల్ నుండి విడుదలైన సందీప్ ఆదివారం రాత్రి మంథిని ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై ఎస్.ఐ. మహేందర్ ని వివరణ కోరగా చెన్నారావుపేట పిఎస్ లో సందీప్ పై ఒక కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement