Saturday, May 4, 2024

ఆరోగ్యం..శ్రేయ‌స్సు కోసం యోగాని ఆచ‌రించండి – ప్ర‌ధాని మోడీ

ఆరోగ్యం..శ్రేయ‌స్సు కోసం ప్ర‌జ‌లు యోగాను త‌ప్ప‌కుండా ఆచ‌రించాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపు ఇచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశం ఇచ్చారు. అంటు వ్యాధులు కానివి (గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర), జీవన శైలి వ్యాధులు నేడు పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగింద‌న్నారు.
యోగాకు సంబంధించి వీడియోను షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. జూన్ 21న మైసూరులో జరిగే యోగా దినోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శ్వాస వ్యవస్థకు సంబంధించి వ్యాయామం కూడా అని ప్రధాని వివరించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగాని సులభంగా చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి ఒక చాప, కొంచెం స్థలం ఉంటే చాలు. యోగాను ఇంట్లోనే చేసుకోవచ్చు. పనిలో.. విరామం సమయంలోనూ చేసుకోవచ్చ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement