Sunday, May 5, 2024

వైసీపీ పార్టీ ఉగ్ర‌వాద శిక్ష‌ణా కేంద్రం-కుల‌గ‌జ్జి ఎక్కువ‌- క‌మెడియ‌న్ పృథ్వీరాజ్

వైసీపీ పార్టీ ఉగ్ర‌వాద శిక్ష‌ణా కేంద్ర‌మ‌ని క‌మెడియ‌న్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల కాలంలో కాంట్రవర్సీ లకు గురి అవుతున్నాడు ఈయ‌న‌. ఇకపోతే వైసీపీలోకి చేరిన తరువాత పృధ్వీరాజ్ టీ డీ పీ పార్టీని ఎన్నోరకాలుగా తన మాటలతో విమర్శించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ వైసిపి పార్టీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసిపి పార్టీ గురించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వెల్లడించారు. వైసిపి పార్టీలో కులగజ్జి ఎక్కువగా ఉంది అని.. ఒకవేళ నా పేరు వెనుక రెడ్డి అని ఉన్నా కూడా నేను అక్కడే ఉండి పోయే వాడినేమో.. నా పేరు వెనుక రెడ్డి లేదు కాబట్టి నాకు అంత గౌరవం ఇవ్వలేదు అంటూ ఆయన తెలిపారు.

నిజానికి పృథ్వీరాజ్ రాజకీయాలలో అంత బాగా వైరల్ అవడానికి కారణం వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల పార్టీల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారి పై దారుణంగా తన మాటల తూటాలు విసిరారు. ఇక తన స్థాయికి మించి ఆయనను ఎస్ వి బి సి చైర్మన్ చేశారు . కానీ ఒక మహిళ ఉద్యోగితో వెనుక నుంచి పట్టుకుంటే అంటూ అసభ్యకరమైన ఫోన్ కాల్స్ బయటకు రావడంతో పదవి నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి పృధ్వీరాజ్ ను పార్టీ నుంచి పక్కన పెట్టడం.. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం.. ఇలా పూర్తిగా దూరం పెట్టారు. ప్రస్తుతం 2024లో వచ్చేఎన్నికలలో జనసేన పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిపారు పృథ్వీరాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement