Tuesday, April 30, 2024

రాహుల్ ఆఫీసు ధ్వంసం కేసు.. 19 మంది ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల‌ అరెస్టు

కేర‌ళ‌ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో పోలీసులు 19 మంది ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. ఈ కేసుతో లింకున్న మ‌రికొంత మందిని అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అరెస్టు అయిన వారంతా స్థానిక ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌లే. రెండు వారాల పాటు వాళ్ల‌ను రిమాండ్‌లోకి తీసుకున్నారు. వ‌య‌నాడ్‌లోని రాహుల్ ఆఫీసుపై దాడి జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం అద‌న‌పు డీజీపీ ర్యాంక్ ఆఫీస‌ర్‌తో విచార‌ణ‌కు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement