Sunday, April 28, 2024

వైసీపీ ప్రభుత్వం రెడ్ల రాజ్యం కాదు- బడుగుల రాజ్యం – డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి

రీసెంట్ గా మంత్రిగా రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి..ఈ సందర్భంగా జగన్ ఫొటోను చేతిలో పట్టుకుని ఆయన తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించడంపై స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని చెప్పారు. అందుకే జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించానని తెలిపారు. కాళ్లు పట్టుకుంటేనో, కాకా పడితేనో జగన్ పదవులు ఇవ్వరని, పార్టీ కోసం కష్టించి పని చేసే వారికే పదవులు ఇస్తారని చెప్పారు. తనకు రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని అనుకోలేదని అన్నారు. తనకు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేది రెడ్ల రాజ్యం కాదని, ఇది బడుగుల రాజ్యమని నారాయణస్వామి అన్నారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి… తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement